-
-
Home » Andhra Pradesh » Additional EO Dharma Reddy Alipiri que complex
-
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వాదం..
ABN , First Publish Date - 2020-10-31T17:59:46+05:30 IST
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వివాదానికి దిగారు.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డితో భక్తుల వాగ్వివాదానికి దిగారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ధర్మారెడ్డి కనిపించగానే భక్తులు ఆయనను అడ్డుకున్నారు. కాగా.. నిరసన వ్యక్తం చేస్తున్న వారికి టోకెన్లు జారీ చేయాలని ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ధర్మారెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉచిత దర్శనం టోకెన్లను కొనసాగించడం కష్టమవుతోందని తెలిపారు. ఈవో, చైర్మన్లతో మాట్లాడి టోకెన్ల జారీ నిలుపుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు.