ఆంధ్రుల రాజధాని అమరావతే: నటుడు శివాజీ
ABN , First Publish Date - 2020-02-08T14:07:24+05:30 IST
ఆంధ్రుల రాజధాని అమరావతే: నటుడు శివాజీ

ప్రముఖ సినీ నటుడు శివాజీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని విషయమై స్పందించారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని శివాజీ పేర్కొన్నారు. ప్రభుత్వం పరిపాలన ఎక్కడ నుంచి అయినా చేసుకోవచ్చని కానీ ఏపీ రాజధాని మాత్రం అమరావతేనని... ఇది తధ్యమని శివాజీ స్పష్టం చేశారు.