ఇంటికి చేరిన అచ్చెన్న
ABN , First Publish Date - 2020-09-01T09:48:48+05:30 IST
మాజీ మం త్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సోమవారం విజయవాడలోని నివాసానికి చేరుకున్నారు. ఈఎ్సఐ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో

అమరావతి/టెక్కలి/మంగళగిరి, ఆగస్టు 31: మాజీ మం త్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సోమవారం విజయవాడలోని నివాసానికి చేరుకున్నారు. ఈఎ్సఐ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో 78 రోజులుగా ఏసీబీ కస్టడీలో ఉన్న అచ్చెన్నకు ఇటీవల హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ రాగా చికిత్స పొందారు. సోమవారం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో మళ్లీ పరీక్షలు చేసుకోగా నెగెటివ్ వచ్చింది. దీంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయి.. విజయవాడలోని నివాసానికి చేరుకున్నారు. అచ్చెన్నను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పి.అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పార్టీ నేత బ్రహ్మం చౌదరి పరామర్శించారు. అచ్చెన్న మంగళవారం కుటుంబ సభ్యుల తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.