‘జగనన్న తోడు’కు స్టాంప్ డ్యూటీ రద్దు
ABN , First Publish Date - 2020-11-27T08:54:00+05:30 IST
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తుల వారికి అందించే రుణాలపై బ్యాంకు డాక్యుమెంటేషన్ ఫీజు రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని గ్రామ...
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తుల వారికి అందించే రుణాలపై బ్యాంకు డాక్యుమెంటేషన్ ఫీజు రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్యకార్యదర్శి అజయ్జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల లబ్ధిదారులకు రూ.32 కోట్ల ప్రయోజనం చేకూరనుందని చెప్పారు.