LIVE: ఏపీ రాజధాని బిల్లుకు బ్రేక్
ABN , First Publish Date - 2020-06-18T13:29:13+05:30 IST
LIVE: ఏపీ రాజధాని బిల్లుకు బ్రేక్
అమరావతి: ఏపీ శాసనసభ, మండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు అనుకున్నది ఏదీ కాకుండా...ఏ బిల్లు పాస్ కాకుండా నిరవధికంగా వాయిదా పడింది. ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్. దేశం విషయానికి వస్తే భారత్, చైనా దురాక్రమణకు హాట్ టాపిక్ అయ్యింది. భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా చైనా దురాక్రమణను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు 2020 లద్దాఖ్లో అదే ఘటన పునరావృత్తం అయ్యింది. ఇది ఒకవైపు దేశాన్ని కలవరపెడుతోంది. వీటన్నింటితో పాటు కరోనా వైరస్ మహమ్మారి. అమెరికా వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా చైనానే కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక వివాదం నడుస్తుండగా, దేశ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీనికి నియంత్రణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. సమీక్షలు జరుపుతోంది. ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ అయితే ఉండే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండింటితో పాటుగా చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. ఇదే అంశాలపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో నిర్వహించిన చర్చలో ఏపీ టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, సీపీఎం నేత కందారపు మురళి, బీజేపీ నేత పూడి తిరుపతిరావు, కాంగ్రెస్ నేత సంజీవ్రెడ్డి పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.