LIVE: వైజాగ్ ప్రమాదాల వెనుక కుట్ర ఉందా?

ABN , First Publish Date - 2020-07-16T13:17:41+05:30 IST

LIVE: వైజాగ్ ప్రమాదాల వెనుక కుట్ర ఉందా?

LIVE: వైజాగ్ ప్రమాదాల వెనుక కుట్ర ఉందా?

అమరావతి: ఏపీలో ఇప్పుడు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌కు సంబంధించిన చర్చ జరుగుతోంది. విశాఖలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, వరుసగా ఫార్మా ఇండస్ట్రీస్‌లలో జరిగిన ప్రమాదాల వెనక కుట్ర ఉంది అనే ఒక ఆరోపణ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ ఇలాంటి కుట్రకు పాల్పడుతోంది అనే అనుమానాన్ని  వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్జీపాలిమర్స్‌ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం వేసిన కమిటీ...రిపోర్టును ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారం సంస్థకు సంబంధించిన యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ సంస్థకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత పయనీరు, సాల్వంట్స్ కంపెనీలలో వరుసగా ప్రమాదాలు జరిగాయి. ఈ రెండు చోట్ల వరుసగా ప్రమాదాలు జరుగడం వెనక టీడీపీ కుట్ర ఉంది అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ నిర్వహించారు. ఈ చర్చలో బీజేపీ నేత సుహాసిని, టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జనసేన సుందరపు విజయ్‌కుమార్ పాల్గొన్నారు. చర్చ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 


Updated Date - 2020-07-16T13:17:41+05:30 IST