ఏబిన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. తహసీల్దార్పై వేటు
ABN , First Publish Date - 2020-07-14T03:44:10+05:30 IST
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కథనాలకు ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన వచ్చింది. ఈ కథనాల ఆధారంగా అమరావతి ఇన్చార్జ్ తహసీల్దార్ నిర్మలా కృష్ణను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
గుంటూరు: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కథనాలకు ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన వచ్చింది. ఈ కథనాల ఆధారంగా అమరావతి ఇన్చార్జ్ తహసీల్దార్ నిర్మలా కృష్ణను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి ముత్తాయపాలెం భూముల వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. బ్యాంక్ తనఖాలో ఉన్న భూములను ఇళ్ల స్థలాలకు తీసుకున్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. దీనిపై విచారణ జరిపించిన కలెక్టర్, ఆరోపణలు వాస్తవం అని తేలింది. తహసీల్దార్పై వేటు వేశారు.