వైసీపీ నేతలు బానిసల్లా బతుకుతున్నారు: అబ్దుల్ అజీజ్
ABN , First Publish Date - 2020-06-18T18:58:36+05:30 IST
నెల్లూరు: వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసల్లా బతుకుతున్నారని టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ విమర్శించారు.
నెల్లూరు: వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసల్లా బతుకుతున్నారని టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ విమర్శించారు. శాసనమండలి సంఘటన అత్యంత హేయమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఏపీ బడ్జెట్ మొత్తం అబద్దాలేదనన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ వర్గానికి మేలు చేసేది కాదని అజీజ్ తెలిపారు. గత బడ్జెట్ కేటాయింపుల్లో రైతులు, నిరుద్యోగులు, పరిశ్రమలు, విద్య, వైద్యానికి సగం కూడా ఖర్చు చేయలేదని అజీజ్ తెలిపారు. కరోనా విజృంభించి ఎంతో మంది ప్రాణాలు పోతుంటే బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఏపీ ఆదాయం రూ.1,10,000కోట్లు అయితే, రూ.2,24,000 కోట్లు అంచనా చూపడం ఘోరమన్నారు. ఆదాయం తగ్గిపోయి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయిని అజీజ్ పేర్కొన్నారు.