అపహరణ.. ఉపసంహరణ

ABN , First Publish Date - 2020-03-16T09:36:13+05:30 IST

ర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులే నేరుగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో పాల్గొన్నారు. కొలిమిగుండ్ల మండలం నుంచి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సుగుణమ్మతో వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి

అపహరణ.. ఉపసంహరణ

  • కర్నూలు జిల్లాలో వైసీపీ ఆగడాలు

కర్నూలు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులే నేరుగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో పాల్గొన్నారు. కొలిమిగుండ్ల మండలం నుంచి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సుగుణమ్మతో వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి కుమారుడు ఉదయ్‌ భాస్కర్‌రెడ్డి శనివారం దగ్గరుండి మరీ విత్‌ డ్రా చేయించారు. ఆర్వో కార్యాలయంలో ఆమె పక్కనే నిలబడి ఉపసంహరణ చేయిస్తున్నా ఆర్వో వెంకట సుబ్బయ్య, ఇతర అధికారులెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. స్థానిక టీడీపీ నాయకులు విషయం తెలుసుకుని జడ్పీ కార్యాలయానికి చేరుకునే లోపే విత్‌ డ్రా ప్రక్రియను ముగించారు. కాగా.. అధికారుల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు.

Updated Date - 2020-03-16T09:36:13+05:30 IST