తెనాలిలో ఓ ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2020-09-06T18:39:40+05:30 IST
తెనాలిలోని బాలాజీరావు పేటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది.
గుంటూరు జిల్లా: తెనాలిలోని బాలాజీరావు పేటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూలేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. రూ. 8 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారు. దీంతో బాధితుడు గోపాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.