9 శ్రామిక్‌ రైళ్లకు అంతరాయం

ABN , First Publish Date - 2020-05-08T11:32:56+05:30 IST

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు లీకైన ఘటన ప్రభావంతో 9 శ్రామిక్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

9 శ్రామిక్‌ రైళ్లకు అంతరాయం

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన ఎఫెక్ట్‌


న్యూఢిల్లీ, మే 7: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు లీకైన ఘటన ప్రభావంతో 9 శ్రామిక్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కరోనా నేపథ్యంలో  దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతూర్లకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.  ఫ్యాక్టరీకి సమీపంలోనే ఉన్న సింహాచలం ఉత్తర రైల్వేస్టేషన్‌లోని సిబ్బంది కూడా ఊపిరి అందకపోవడం, కళ్లు మంటలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో గురువారం ఉదయం 8.35 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్లను ఆపేశారు.

Updated Date - 2020-05-08T11:32:56+05:30 IST