ఏపీలో గత 24 గంటల్లో 82 పాజిటీవ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-28T17:52:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 82 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలో గత 24 గంటల్లో 82 పాజిటీవ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 82 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1259కి చేరాయి. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 40, గుంటూరు 17, కృష్ణా జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 332కాగా, గుంటూరు జిల్లాలో 254, కృష్ణా జిల్లాలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 258 మంది డిశ్చార్జ్ కాగా.. 31 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 5,783 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 82 మందికి పాటిజీవ్ వచ్చింది. అయితే కొత్తగా మరణాలు లేవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క మరణం నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్దారించవలసి ఉంది.

Updated Date - 2020-04-28T17:52:48+05:30 IST