ఏపీలో కొత్తగా 7,956 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-14T23:42:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మునుపటితో పోలిస్తే ఇవాళ కాస్త తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 7,956 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మునుపటితో పోలిస్తే ఇవాళ కాస్త తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలుగా ఏపీలో 7,956 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే  ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 60 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,972 సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 93,204 యాక్టివ్ కేసులుండగా.. 4,76,903 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 46.61 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


ఏయే జిల్లాలో ఎన్నెన్ని కేసులు...


ఏయే జిల్లాలో ఎన్నెన్ని మరణాలు..

కొత్తగా చిత్తూరులో-09, అనంతపురంలో-07, కర్నూలు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. నెల్లూరులో-03, గుంటూరు జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్లు మీడియా బులెటిన్‌లో తెలిపింది. గడిచిన 25 గంటల్లో 9,764 మంది కరోనా నుంచి జయించి డిశ్చార్జ్ అయ్యారు.

Updated Date - 2020-09-14T23:42:05+05:30 IST