వచ్చే ఏడాదిలో 50వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2020-02-19T19:02:11+05:30 IST
విశాఖ: ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు గౌతమ్రెడ్డి, అవంతి శ్రీనివాస్ బుధవారం సమావేశం అయ్యారు.
విశాఖ: ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు గౌతమ్రెడ్డి, అవంతి శ్రీనివాస్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ వస్తుందన్నది ఊహాజనితమేనన్నారు. వచ్చే ఏడాదిలో 50వేల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఐటీ పాలసీ ప్రకటిస్తామన్నారు. విశాఖకు ఎయిర్ కనెక్టివిటీ పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు త్వరలో విడుదల చేస్తామన్నారు. మిలీనియం టవర్స్-2కి నిధులు విడుదల చేశామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.