ఇసుక, మద్యం అక్రమాలపై 485 కేసులు
ABN , First Publish Date - 2020-05-31T08:34:23+05:30 IST
ఇసుక, మద్యం అక్రమాలపై ఇప్పటివరకూ 485 కేసులు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈసీ) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. 955 మందిపై కేసులు పెట్టి, 730 వాహనాలు సీజ్ చేసినట్లు
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): ఇసుక, మద్యం అక్రమాలపై ఇప్పటివరకూ 485 కేసులు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈసీ) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. 955 మందిపై కేసులు పెట్టి, 730 వాహనాలు సీజ్ చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో వివరించారు. ఇసుక, మద్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పాత నేరస్థులైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, రౌడీషీట్స్ తెరవాలని యోచిస్తున్నామని చెప్పారు.