గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నాయి: మోపిదేవి
ABN , First Publish Date - 2020-03-29T23:24:02+05:30 IST
గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నాయని, వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. 88 ఆస్పత్రులు సిద్ధం
అమరావతి: గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నాయని, వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. 88 ఆస్పత్రులు సిద్ధం చేసి, 9,352 బెడ్స్ రెడీగా ఉంచామన్నారు. 15 రోజుల పాటు రేషన్ సరఫరా చేస్తామని, నిత్యవసరాల ధరలు పెంచితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మోపిదేవి హెచ్చరించారు.