బిహార్కు 1400 మంది వలస కూలీలు
ABN , First Publish Date - 2020-05-18T10:04:36+05:30 IST
నెల్లూరు జిల్లాతో పాటు కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు
![బిహార్కు 1400 మంది వలస కూలీలు](https://media.andhrajyothy.com/appimg/galleries/202005180319852/05182020043427n78.png)
నెల్లూరు(వెంకటేశ్వరపురం) మే 17: నెల్లూరు జిల్లాతో పాటు కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు ఆదివారం ప్రత్యేక రైలులో బిహార్కు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే రెండు ప్రత్యేక రైళ్లల్లో 2,345 మందిని వారి స్వస్థలాలకు పంపించారు. ఈ క్రమంలో ఆదివారం మరో 1400 మందిని బిహార్, పట్నాలకు తరలించారు.