ఆంధ్రప్రదేశ్లో 13కి చేరిన కేసులు
ABN , First Publish Date - 2020-03-28T09:00:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఒక్క రోజే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
![ఆంధ్రప్రదేశ్లో 13కి చేరిన కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఒక్క రోజే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లోనూ లోకల్ కాంటాక్ట్ ద్వారానే వైరస్ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖలో ఓ రోగి నుంచి తండ్రికి, గుంటూరులో రోగి నుంచి అతని భార్యకు సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 13కి చేరింది.