1200 కిలోల టేకు చేప
ABN , First Publish Date - 2020-06-18T10:30:15+05:30 IST
1200 కిలోల టేకు చేప

మచిలీపట్నం టౌన్: మచిలీపట్నం గిలకలదిండి ఫిషింగ్ హార్బర్కు సమీపంలో బుధవారం మత్స్యకారులకు భారీ టేకు చేప దక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు వెంకన్నకు భారీ టేకు చేప లభించింది. దాదాపు 1200 కిలోల బరువైన ఈ చేపను పొక్లెయిన్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఈ చేప 37 వేల వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపను చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా వచ్చి తిలకిస్తున్నారు.