Home » Road Accident
ఎన్నికల ప్రభావంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిలో వాహన రద్దీ బుధవారం కూడా కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఘటనలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీలోని స్వస్థలానికి వెళ్లిన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి బలైపోయాడు. విజయవాడ-హైదరాబాద్ హైవేలోని పంతంగి టోల్గేటు సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో కొనికల దీపక్ రాజ్ (29) అనే యువకుడు బుధవారం మరణించాడు.
Andhrapradesh: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.
పల్నాడు జిల్లా పసుమర్రు రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
పల్నాడు జిల్లా: చిలకలూరిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. టిప్పర్ లారీని ఢీ కొంది
తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తమిద్మారన ఆ రో తరగతి చదువుతున్నాడు. బడికి వేసవి సెలవులు వచ్చాయి. తన మేన మామ విజయ్ క్యాంటర్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సరుకు రవాణా కోసం వివిధ ప్రాంతాలకు వెళు తుంటాడు. మేనల్లుడికి మామ వెంట వెళ్లి ఊళ్లన్నీ తిరగాలనినిపించింది. ‘మామా.. మా మా.. నేనూ వస్తా నీ వెంట..’ అని గోముగా అడిగాడు. బహుషా తను.. ‘వద్దురా.. ఎండలకు తట్టుకోలేవు..’ అని సముదాయించి ఉంటాడు. ముద్దుల మేనల్లుడు బుంగమూతి పెట్టగానే.. చెల్లెకి నచ్చజెప్పి వెంట తీసుకెళ్లింటాడు.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం అరుణను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జాతీయ రహదారి కొంత భాగం కుంగిపోవడంతో కనీసం 24 మంది మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్ నుంచి పంగళ్ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో ...
జీవనోపాధి కోసం ఓ వ్యక్తి బుధవారం ఎద్దులబండిలో ఇసుక తరలిస్తుండగా వెనుక నుంచి కంటెయినర్ లారీ ఢీకొనడంతో ఎద్దు మృతిచెందింది. అతడు గాయాల పాలయ్యాడు. సోమందేపల్లికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి అదే మండలంలో వెలగమాకుల పల్లి సమీపం లోని వంక నుంచి ఎద్దులబండిలో ఇసుక తరలిస్తున్నా డు. అతడు 44వ జాతీయ రహదారి మీదుగా సోమం దేపల్లికి వస్తుండగా మార్గమధ్యలో పాపిరెడ్డిపల్లి వద్ద తెల్లవారుజామున 6గంటల సమయంలో ఓ కంటెయినర్ లారీ ఎద్దులబండిని వెనుక నుంచి ఢీకొంది.
గత కొన్ని రోజులుగా దక్షిణ చైనా(south China)లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్(Guangdong province)లోని మీజౌ నగరంలో హైవేలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందగా, అనేక మంది గాయపడ్డారు.