Home » Jobs
వింత ఆఫర్తో ఓ ఉద్యోగార్థి ఏకంగా వింగిఫై కంపెనీ వ్యవస్థాపకుడినే ఇంప్రెస్ చేసి జాబ్ కొట్టేశాడు. తనకు జాబ్ ఇస్తే ఎదురు డబ్బిస్తానంటూ అభ్యర్థి మేసేజ్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రముఖ ఐటీ రంగ సంస్థ టెక్ మహీంద్రా(Tech Mahindra) ఫ్రెషర్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో 6000 మంది ఫ్రెషర్లను నియమించుకోబోతున్నట్లు తెలిపింది. చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న నేపథ్యంలో టెక్ మహీంద్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల ఉద్యోగార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ ప్రభావం కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడా పడబోతోందా అంటే అవుననే అంటున్నారు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె.కృతివాసన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావంతో కాల్ సెంటర్ జాబ్లు ఊస్ట్ కావడం పక్కా అని వెల్లడించారు.
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్లో డాటా సైంటిస్ట్గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్లో లైన్లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. దరఖాస్తు చేసుకున్న మూడో నిమిషంలోనే అతడి అప్లికేషన్ను సంస్థ తిరస్కరించింది.
నిరుద్యోగుల(Un Employement) ఆశలను అవకాశంగా మలచుకొని కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు(Out Sourcing Jobs) దందాలకు పాల్పడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో(Departments) ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తెర తీస్తే.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా..
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాటల తూటాలు పేలుస్తునే ఉన్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై, ఉద్యోగాల భర్తీపై ఎప్పకటిప్పుడు జగన్ను షర్మిల విమర్శి్స్తూనే ఉన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారన్నారు. ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు చేసిన మోసం చాలదని... జాబు రావాలంటే జగన్ కావాలని ఘరానా మోసానికి తెరలేపారంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్ల డించింది. 1:100 నిష్పత్తిలో రిజల్ట్స్ రిలీజ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.
ఐటీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కొత్త ఉద్యోగుల (ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్ (Digital), ప్రైమ్ (Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం పేర్కొంది. గతేడాది మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కొత్తవారిని తీసుకోని టీసీఎస్.. ఈ ఏడాది ఫ్రెషర్లను తీసుకోబోతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.
భాగ్యనగరంలో(Hyderabad) భారీ స్కామ్ వెలుగు చూసింది. నిరుద్యోగుల అవసరాలనే ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకున్నారు కేటుగాళ్లు. పార్ట్ టైం ఉద్యోగాల(Part Time Jobs) పేరుతో భారీ మోసానికి తెరలేపారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 524 కోట్లు దోచేశారు కేటుగాళ్లు. ఒక్క హైదరాబాద్లోనే కాదు..