Home » Guntur
Andhrapradesh: ఏపీలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు.
పల్నాడు: జిల్లాలో 144 సెక్షన్ నేపథ్యంలో గుంటూరులో టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ అభ్యర్థులు జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావులను హౌస్ అరెస్టు చేశారు. ఇలా చేయడం సరికాదని నక్కా ఆనందబాబు అన్నారు.
Andhrapradesh: పల్నాడులో జరుగుతున్న దాడులపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. దాడులను నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
సాధారణ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం పట్టణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి టీడీపీ నేతలపై ఐదు కేసులు, వైసీపీ నేతలపై రెండు కేసులు పట్టణ పోలీసు స్టేషనలో నమోదయ్యాయి.
మండలంలోని నరసరావుపేట-చిలకలూరిపేట రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కమ్మ ఈశ్వర్కృష్ణ ప్రసాదు (25) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. నాదెండ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారిపై మంగళవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు దాడి చేసి కలకలం సృష్టించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
గుంటూరు జిల్లాలో జీజీహెచ్ తరువాత అంతడి పెద్ద ఆసుపత్రి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల. ఈ వైద్యశాలకు తెనాలి, కొల్లూరు, కొల్లిపర, వేమూరు, చేబ్రోలు, అమృతలూరు, దుగ్గిరాల వంటి పలు మండలాల నుంచి రోగులు వైద్యసేవలకు వస్తుంటారు.
టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ హెచ్చరించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఓటమి భయంతోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆటవిక చర్యలకు పాల్పడు తున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాపట్ల లోక్సభ పరిధిలోని ఈవీఎంలను భద్రపరిచిన ఇంజనీరింగ్ కళాశాలలోనిస్ర్టాంగ్రూమ్ల వద్ద అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై బుధవారం ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆయన పరిశీలించారు.