Home » Business news
సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టం నుంచి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పుంజుకుంది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లోకి పయనించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎన్నికల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వారంలో తొలి రోజు అయిన సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం తీవ్ర అనిశ్చితిలో కదలాడాయి.
భారతదేశ మార్కెట్లో నేడు (మే 13న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో స్పల్పంగా మార్పు కనిపించింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 10 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ పరిశ్రమల్లో ఉత్పత్తి 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటికల్ ఆఫీస్ డేటా వెల్లడించింది.
ఐపీఓల(IPOs) వారం మళ్లీ వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల(loksabha election 2024) నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ ఈనెలలో అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం రానున్న ఐపీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ఈరోజు (మే 12న) బంగారం(gold) ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ మే 11న సాయంత్రం బంగారం ధరలు దాదాపు రూ.300కుపైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,400కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు(chicken price) పెరిగాయి. దీంతోపాటు కోడి గుడ్ల రేట్లను(egg price) కూడా పౌల్ట్రీ సంస్థలు పెంచేశాయి. అయితే ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు భారీగా మృత్యువాత చెందిన క్రమంలో ఈ రేట్లు పెరిగినట్లు పౌల్ట్రీ యజమానులు చెప్పారు. కానీ ఇటివల కురిసిన వర్షాల నేపథ్యంలో మళ్లీ సామాన్య ప్రజలకు ఊరట లభించింది.
అక్షయ తృతీయ సందర్భంగా నిన్న బంగారం ప్రియులకు ఊరట నిచ్చిన గోల్డ్(gold) ధరలు సాయంత్రం తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఏకంగా రూ. 1400 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల సహా పలు అంశాలు భారత మార్కెట్పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఉపశమనం కలిగించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో పయనించాయి
దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.