నిరుద్యోగుల సమస్యలపై కొట్లాడతా : అశోక్
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:21 AM
నిరుద్యోగులు, ఉద్యోగుల స మస్యలపై కొట్లాడేందుకు తాను నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ది గనున్నట్లు అశోక అ కాడమీ డై రక్టర్ పా లకూరి అ శోక్ తెలిపారు.
నిరుద్యోగుల సమస్యలపై కొట్లాడతా : అశోక్
నల్లగొండ టౌన, ఏప్రిల్ 28: నిరుద్యోగులు, ఉద్యోగుల స మస్యలపై కొట్లాడేందుకు తాను నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ది గనున్నట్లు అశోక అ కాడమీ డై రక్టర్ పా లకూరి అ శోక్ తెలిపారు. న ల్లగొండ ప ట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ త 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, చరిత్రకారుడుగా, వేలమంది నిరుద్యోగులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా అనేక సేవలు అందించినట్లు తెలిపారు. మెగా డీఎస్సీ వే యాలని, గ్రూప్-2, గ్రూప్-3 లలో పోస్టులను పెంచాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఎత్తు తగ్గించాలని, జీవో నెంబర్ 46ను తొలగించాలని, గురుకుల ఉద్యోగాలను సంపూర్ణంగా నిం పాలని, టెట్ నోటిఫికేషన వేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అధ్యాపకుడు నరేష్, పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు.