Share News

కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:22 AM

భు వనగిరి పార్లమెం టు కాంగ్రెస్‌ అభ్య ర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అ త్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు.

 కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సామేల్‌

కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌

శాలిగౌరారం, ఏప్రిల్‌ 29: భు వనగిరి పార్లమెం టు కాంగ్రెస్‌ అభ్య ర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అ త్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. శాలిగౌరారంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. ప్రజలు కోరుకున్న ప్రజాపాలన ఏర్పడిందని, అన్ని వర్గాల ప్రజల లబ్ధి పొం దేందుకు సీఎం రేవంతరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ఇంటింటికి తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని అన్నారు. శాలిగౌరారంలో సోమవారం సాయంత్రం జరిగే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచార సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవం తం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్‌, పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు పాదూరి శంకర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎర్ర చైతన్య, వెంకటయ్య, విజయ్‌, నరేష్‌, సతీష్‌, ధనుంజయ, యుగేందర్‌రెడ్డి, భిక్షంరెడ్డి, దేవేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 12:22 AM