మోదీ మూడోసారి ప్రధాని కావడం తథ్యం
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:10 AM
కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయగౌడ్ అన్నారు.
చౌటుప్పల్ టౌన్, ఏప్రిల్ 28: కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయగౌడ్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశానికి బీజేపీ ఎంతో అవసరమని, విశాల ధృక్పథంతో ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీకి మద్దతుగా నిలబడాలని కోరారు. తాను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. బీజేపీ గెలుపుతో రాచకొండ గుట్టలు పర్యాటక ప్రాంతంగా మారుతుందని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరు వీరారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షంగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, జి. సురేందర్రెడ్డి, మునిసిపాలిటీ అధ్యక్షుడు కంచర్ల గోవర్థన్రెడ్డి, ఊడుగు వెంకటేశం, కాసుల వెంకటేశం, వనం ధనుంజయ్య పాల్గొన్నారు. మండల పరిదిలోని పంతంగి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త సప్పిడి లింగారెడ్డి ఎన్నికల ఖర్చు నిమిత్తం బూర నర్సయ్యకు రూ. 5వేలు విరాళంగా అందజేశారు.