ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తా : క్యామ
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:07 AM
భువనగిరి ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం అన్నారు.
వలిగొండ, ఏప్రిల్ 28: భువనగిరి ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు. తాను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడినని, పిలిచిన వెంటనే మీ ముందు ఉంటానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, వ్యసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు తదితర పథకాలను ప్రారంభించి కేసీఆర్ ప్రజల ఆధరాభిమానాలు చూరగొన్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టాక పేదలకు చేసిందేమీ లేదన్నారు. ఆరు గ్యారంటీల్లో పేదలకు ఎన్ని పథకాలు లబ్ధిచేకూరాయో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, తుమ్మల వెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, కునపురి కవిత, పనుమటి మమత, నాయకులు రేపాక ప్రదీప్రెడ్డి, శంకర్గౌడ్, సంజీవరెడ్డి, నాగరాజు, వెంకట రమణ, మోహన్రెడ్డి, రమేష్, మధు, తదితరులు పాల్గొన్నారు.