ద్రోహం చేసిన వారిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దు
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:12 AM
: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేసిన మండలంలోని బొల్లేపల్లి, చందుపట్ల మాజీ సర్పంచ్లు, నాయకులను తిరిగి కాంగ్రెస్లో చేర్చుకోవద్దని భువనగిరి మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్ అన్నారు.
భువనగిరి టౌన్, ఏప్రిల్ 28: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేసిన మండలంలోని బొల్లేపల్లి, చందుపట్ల మాజీ సర్పంచ్లు, నాయకులను తిరిగి కాంగ్రెస్లో చేర్చుకోవద్దని భువనగిరి మునిసిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్ అన్నారు. భువనగిరిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఓ మాఫియా నాయకుడి కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీని మోసం చేయడం, అధికారంలోకి రాగానే తిరిగి పార్టీలో చేరడం వారికి అలవాటుగా మారిందన్నారు. వారి చేరిక ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. పార్టీలో చేర్చుకునే నిర్ణయంపై నాయకులు పునరాలోచన చేయాలన్నారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్, మాజీ సర్పంచ్ ఎలిమి నేటి కృష్ణారెడ్డి, ఎండీ. అవేజ్ చిస్తీ, తదితరులు పాల్గొన్నారు.