Share News

మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి!

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:49 AM

ప్రధాని నరేంద్రమోదీకి ఓటేస్తే రైల్వేను, ఎల్‌ఐసీని అదానీ, అంబానీలకు అమ్మేస్తారని.. కాబట్టి, ఆయా సంస్థల్లో పని చేసే వారికి ఉద్యోగాలు ఉండాలంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి!

లేకపోతే దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెడతారు

  • రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు

  • పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదు?

  • కాజీపేట, బయ్యారం ఫ్యాక్టరీలు, ఐటీఐఆర్‌ను ఎందుకు రద్దు చేశారు?

  • జవాబులు చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలి

  • దేవుడి ఫొటో చూపి అడుక్కునే వాళ్లలాగ బీజేపోళ్లు ఓట్లడుగుతున్నరు

  • బీజేపీ-బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం.. మేడ్చల్‌ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం

  • మల్కాజిగిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీకి ఓటేస్తే రైల్వేను, ఎల్‌ఐసీని అదానీ, అంబానీలకు అమ్మేస్తారని.. కాబట్టి, ఆయా సంస్థల్లో పని చేసే వారికి ఉద్యోగాలు ఉండాలంటే మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని హెచ్చరించారు. రిజర్వేషన్లు లేకుండా చేసి దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెడతారని విమర్శించారు. రైల్వేలు, ఎల్‌ఐసీ, ఎయిర్‌పోర్టు, బీఎ్‌సఎన్‌ఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఐడీపీఎల్‌, డిఫెన్స్‌ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలను కాంగ్రెస్‌ కల్పించిందని, ఆ సంస్థలను అందులో ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని అన్నారు.

ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనస్థలిపురం, కౌకుర్‌ల వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు వస్తున్న నరేంద్రమోదీ.. రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తున్నారో జవాబు చెప్పి రావాలని సీఎం నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో.. ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారో ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోదీ ఏవిధంగా ఓట్లు అడుగుతారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీవాళ్ల మాటలు చూస్తే మూడు ఎడ్లు.. 36 దొడ్లు అన్నట్లుగా ఉందని విమర్శించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి దేశంలో అధికారంలోకి రావాలని


భూ యజమానితోపాటు కౌలురైతుకూ భరోసా

  • ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తాం

  • గ్రామసభల ద్వారా కౌలురైతులను గుర్తిస్తాం

  • 5 ఎకరాలకుపైగా భూమి 4లక్షల కుటుంబాలకే

  • 92 శాతం మంది రైతులు 3 ఎకరాలలోపువారే

  • ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసేవారిని

  • 50 లక్షల మంది యువత చూసుకుంటారు

  • క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారినే పార్టీలో చేర్చుకుంటున్నాం

  • రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ కోర్‌ అజెండా

  • ఎడ్యుకేషన్‌ పాలసీపై కమిషన్‌ వేస్తాం: రేవంత్‌రెడ్డి

చూస్తున్నారని, పదేళ్లలో చేసిందేదో చెప్పాలని అన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన బాధ్యత తెలంగాణ యువత మీద ఉందన్నారు.

గుండు రాలే.. బండి రాలే!

2021లో వరదలు వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతమంతా మునిగిందని, ఆనాడు బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి అని, గుండు పోతే గుండిస్తానన్నాడని, కానీ, గుండు రాలే.. బండి రాలేదని, అరగుండు వచ్చి ఓట్లు అడుగుతున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నయా పైసా తీసుకురాలేదన్నారు. మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జైశ్రీరామ్‌ అంటున్నారని, బయ్యారం ఉక్కు ఎందుకు ఇవ్వలేదంటే హనుమాన్‌ జయంతి చేశామంటున్నారని తెలిపారు. మన తాతల ముత్తాతల నుంచే శ్రీరామనవమి తదితర పండుగలు చేశామని, ఎల్లమ్మ, పోచమ్మలకు కోళ్లు కోశామని, కల్లు పోశామని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. దేవుని ఫోటో చూపి రోడ్ల మీద అడుక్కునే మాదిరిగా బీజేపీవాళ్లు ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు.

పదేళ్లలో ఏం చేశారో చెప్పకుండా..

కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా ఉండి ఏమి చేశారో చెప్పుకోకుండా, వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన తమను తిట్టుకుంటూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. విడివిడిగా వస్తే నెగ్గలేమని అర్థం చేసుకున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకట్లో చేతులు కలిపాయని.. అందుకనే మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుస్తున్నారంటూ మేడ్చల్‌ ఎమ్మెల్యే (మల్లారెడ్డి) అందరి ముందే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ పక్కన కూర్చొని మంత్రిగా చేసిన ఈటల రాజేందర్‌ కూడా రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలకు బాధ్యుడేనని, పంపకాలలో తేడా వచ్చి బయటకొచ్చాడని రేవంత్‌ విమర్శించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకే ఆ తర్వాత ఈటలను అక్కడి ప్రజలు ఓడగొట్టారన్నారు. ఆనాడు కొడంగల్‌లో కేసీఆర్‌ కక్ష గట్టి తనను ఓడిస్తే మల్కాజ్‌గిరి నుంచి ప్రశ్నించే గొంతుకగా ఎంపీగా గెలిపించారని, తాను సీఎం కావడానికి నాడు మల్కాజ్‌గిరి ప్రజలిచ్చిన ప్రొత్సహమే కారణమని రేవంత్‌ తెలిపారు. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌, చంద్రాయణ్‌గుట్ట, పీ7రోడ్డు ద్వారా ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలును విస్తరించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.


భూ యజమానితోపాటు.. కౌలురైతుకూ భరోసా

  • గ్రామసభల ద్వారా కౌలురైతుల గుర్తింపు

  • ఎడ్యుకేషన్‌ పాలసీపై కమిషన్‌: రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతుతోపాటు ఆ భూమి యజమానికీ రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తామని చెప్పారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎగ్గొట్టేది లేదని స్పష్టం చేశారు. గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తిస్తామని, ఆయా గ్రామాల్లో కౌలు రైతుల జాబితాలను పంచాయతీల్లో పెట్టి.. అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియనంతా పారదర్శకంగా చేస్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెడతానని అన్నారు. ఆదివారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారేనని సీఎం చెప్పారు. ఐదెకరాల పైబడి భూమి ఉన్నది 4 లక్షల కుటుంబాలకేనన్నారు. నాలుగేళ్లపాటు అందరూ కలిసి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్‌ చేసిన కష్టానికి వంద తరాలకు సరిపోయేంత కూలి ఆయనకు గిట్టుబాటైందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణకు జాతిపిత కేసీఆర్‌ కాదని, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని చెప్పారు.


ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్ర చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది యువత వారి భ్రమలను తొలగింపజేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే కూలగొడతామని బయలు దేరారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు వచ్చి తమతో కలిసి నడుస్తామని చెప్పారని వెల్లడించారు. అయితే క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారిని, పద్ధతి గలవారినే కాంగ్రె్‌సలోకి తీసుకుంటున్నామని చెప్పారు.

సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై తనకు స్పష్టత ఉందన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమనేదే బీజేపీ కోర్‌ ఎజెండా అని రేవంత్‌ పునరుద్ఘాటించారు. తాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. ప్రజలకు పంచుతామని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తే ఆదాయం, ఉపాధి పెరుగుతాయన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీపై కమిషన్‌ వేస్తామని చెప్పారు. ఇక సచివాలయం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి దండ వేయకపోవడంపై సీఎం స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఏది చేసినా సీఎస్‌, డీజీపీలే చేయాలని అన్నారు. సీఎస్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసినందున తాము అక్కడికి వెళ్లి దండ వేశామని తెలిపారు. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో పట్టువస్త్రాలు కూడా సీఎస్సే సమర్పించారని గుర్తు చేశారు.

Updated Date - Apr 29 , 2024 | 03:49 AM