Share News

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల సంక్షేమం సాధ్యం

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:15 PM

కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ అన్నారు. దుగ్నే పల్లి, సుందరసాల, ముత్తరావుపల్లి, పొక్కూరు, కొమ్మెర గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల సంక్షేమం సాధ్యం

చెన్నూరు, ఏప్రిల్‌ 29: కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ అన్నారు. దుగ్నే పల్లి, సుందరసాల, ముత్తరావుపల్లి, పొక్కూరు, కొమ్మెర గ్రామాల్లో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజ లను కలిసి కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, రవి, బాపగౌడ్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌: పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని 14, 15 వార్డుల్లో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు, ప్రస్తుత మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. పిన్నింటి రఘునాథరెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్‌, గోపతి రాజయ్య, జంగం కళ, నాయకులు అబ్దుల్‌ అజీజ్‌, పాల్గొన్నారు.

దండేపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారం టీ పథకాలను అమలు చేస్తామని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతపల్లి, తానిమడుగు పంచాయతీల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం, బేహరన్‌గూడలో ఉపాధి హామీ కూలీల వద్ద వెళ్లి పెద్దపల్లి ఎంపీ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమ యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను త్వరలో పూర్తిస్ధాయిలో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 10:15 PM