తాగునీటి సరఫరాకు చర్యలు
ABN , Publish Date - Apr 29 , 2024 | 10:21 PM
వేసవి కాలం పూర్తయ్యేంత వరకు జిల్లా వ్యాప్తంగా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఇంటెక్వెల్, గ్రిడ్లను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ మధుసూదన్తో కలిసి పరిశీలించారు.
హాజీపూర్, ఏప్రిల్ 29 : వేసవి కాలం పూర్తయ్యేంత వరకు జిల్లా వ్యాప్తంగా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ఇంటెక్వెల్, గ్రిడ్లను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ మధుసూదన్తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు సెగ్మెంట్ పరిధిలో వేసవి కాలం పూర్తయ్యేంత వరకు నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారుల సమన్వయంతో పరిష్కరించాలన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.