అటవీ ఆంక్షలు ఎత్తివేయకుంటే ఉద్యమించాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 10:09 PM
లక్షెట్టిపేట నుంచి జన్నారం మీదుగా ఆదిలా బా ద్, నిర్మల్కు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహనాల వెళ్లకుండా అటవీ శాఖ విధించిన నిబంధనలు ఎత్తివేయ కుం టే ఉద్యమాలు చేపట్టాలని సామాజిక పోరాట సమితి నాయకులు పేర్కొ న్నారు.
జన్నారం, ఏప్రిల్ 28: లక్షెట్టిపేట నుంచి జన్నారం మీదుగా ఆదిలా బా ద్, నిర్మల్కు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహనాల వెళ్లకుండా అటవీ శాఖ విధించిన నిబంధనలు ఎత్తివేయ కుం టే ఉద్యమాలు చేపట్టాలని సామాజిక పోరాట సమితి నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం ఆర్యవైశ్య భవన్లో సామాజిక పోరాట సమితి ఆధ్వర్యం లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ అటవీ ఆంక్షల వల్ల వ్యాపారులే కాకుండా ప్రజలు నష్టపో తున్నార న్నారు. వెంటనే అటవీ శాఖ విధించిన ఆంక్షలు ఎత్తివేసి రాకపోకలు సాగించేలా కృషి చేయాలని, లేకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు భూమాచారి, షేక్ అక్బర్, విజయ్, సుదన్లాల్, మహేష్ పాల్గొన్నారు.