Share News

దళారులను నమ్మి మోసపోవద్దు

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:06 PM

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అద నపు కలెక్టర్‌ మోతిలాల్‌ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

జైపూర్‌, ఏప్రిల్‌ 28: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అద నపు కలెక్టర్‌ మోతిలాల్‌ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లోని వసతులు, గన్నీ సంచులు, ధాన్యం రవాణా అంశాలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొం దాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, రైతులు ధాన్యాన్ని మట్టి, బెడ్డలు లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. టేకుమట్లలోని జయలక్ష్మీ రైసుమిల్లు, మంజునాధ రైసు మిల్లులను తనిఖీ చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 10:06 PM