Share News

నీరజ్‌కు కఠిన సవాల్‌

ABN , Publish Date - May 10 , 2024 | 01:54 AM

టోక్యో చాంపియన్‌, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు కఠిన పరీక్ష ఎదురుకానుంది...

నీరజ్‌కు కఠిన సవాల్‌

నేడు డైమండ్‌ లీగ్‌

దోహా: టోక్యో చాంపియన్‌, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు కఠిన పరీక్ష ఎదురుకానుంది. శుక్రవారం జరిగే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ తొలి అంచెలో డిఫెండింగ్‌ చాంప్‌గా నీరజ్‌ బరిలోకి దిగుతున్నాడు. చోప్రాకు సమవుజ్జీలైన ప్రపంచ మాజీ చాంపియన్‌ పీటర్స్‌ (గ్రనెడా), ఒలింపిక్‌ పతక విజేత జాకబ్‌ వాల్టెజ్‌ (చెక్‌), యూరోపియన్‌ చాంప్‌ జూలియన్‌ వెబర్‌ లాంటి మేటి అథ్లెట్లు ఈసారి పోటీలో ఉన్నారు. దీంతో టైటిల్‌ నిలబెట్టుకోవడం నీరజ్‌కు ఒకింత సవాలే. ఇక, నీరజ్‌ సహచరుడు, ఆసియా క్రీడల రజత పతక విజేత కిషోర్‌ జనా కూడా తొలిసారి డైమండ్‌ లీగ్‌లో పోటీపడుతున్నాడు.

Updated Date - May 10 , 2024 | 01:54 AM