ఫైనల్స్లో మనోళ్లు ఏడుగురు
ABN , Publish Date - May 04 , 2024 | 05:22 AM
ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షి్పలో మరో ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించారు....
ఆసియా బాక్సింగ్
అస్తానా (కజకిస్థాన్): ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షి్పలో మరో ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించారు. దీంతో ఈ టోర్నమెంట్లో భారత్కు ఇప్పటివరకు 22 పతకాలు ఖాయమయ్యాయి. ఇందులో 12 పతకాలు మహిళా బాక్సర్లకు దక్కనున్నాయి. శుక్రవారం జరిగిన 48 కిలోల విభాగంలో బ్రిజేష్ 5-0తో తాలైబక్ ఇయాసూర్ (మంగోలియా)పై, 60 కి. కేటగిరీలో సాగర్, 75 కి. కేటగిరీలో రాహుల్, 92 కి. విభాగంలో ఆర్యన్ విజయం సాధించారు. వీరితో పాటు యశ్వర్దన్ సింగ్ (63.5 కి.), ప్రియాన్షు (71 కి.), ఫైనల్స్లో ప్రవేశించారు. కాగా సుమిత్ (67 కి.), సాహిల్ (80 కి.) కాంస్య పతకాలు సాధించారు.