Share News

ఆఖరి రోజు ఏడు స్వర్ణాలు

ABN , Publish Date - May 08 , 2024 | 04:01 AM

ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాళ్లు 12 స్వర్ణాలతో అదరగొట్టారు...

ఆఖరి రోజు ఏడు స్వర్ణాలు

అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప

ఆస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాళ్లు 12 స్వర్ణాలతో అదరగొట్టారు. ఆఖరి రోజైన మంగళవారం జరిగిన పోటీల్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రీతి (54 కిలోలు) సహా ఏడుగురు బాక్సర్లు స్వర్ణాలు సాధించారు. మరో ఐదుగురు బాక్సర్లు రజతాలు దక్కించుకున్నారు. మొత్తంగా 12 స్వర్ణాలు, 14 రజత, 17 కాంస్యాలతో 43 పతకాలు సాధించిన భారత్‌ రెండో స్థానంతో టోర్నీని ముగించింది. ఆతిథ్య కజకిస్థాన్‌ 48 మెడల్స్‌తో అగ్రస్థానం సొంతం చేసుకుంది.

Updated Date - May 08 , 2024 | 04:01 AM