Share News

పాకిస్థాన్‌ జట్టు కోచ్‌లుగా కిర్‌స్టెన్‌, గిలెస్పీ

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:47 AM

పాకిస్థాన్‌ వన్డే, టీ20 జట్లకు గ్యారీ కిర్‌స్టెన్‌ (దక్షిణాఫ్రికా) కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే టెస్టు ఫార్మాట్‌లో జేసన్‌ గిలెస్పీ (ఆస్ర్టేలియా) ఈ బాధ్యతలు తీసుకోనున్నాడు...

పాకిస్థాన్‌ జట్టు కోచ్‌లుగా కిర్‌స్టెన్‌, గిలెస్పీ

కరాచీ: పాకిస్థాన్‌ వన్డే, టీ20 జట్లకు గ్యారీ కిర్‌స్టెన్‌ (దక్షిణాఫ్రికా) కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే టెస్టు ఫార్మాట్‌లో జేసన్‌ గిలెస్పీ (ఆస్ర్టేలియా) ఈ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీ్‌సకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన అజర్‌ మహమూద్‌ను ఈ మూడు ఫార్మాట్లకూ అసిస్టెంట్‌ కోచ్‌గా నియమిస్తున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పేర్కొంది. వీరంతా రెండేళ్లపాటు పదవుల్లో ఉంటారు. వచ్చే నెల పాక్‌ టీమ్‌ ఇంగ్లండ్‌తో ఆడే నాలుగు టీ20ల సిరీ్‌సకు గ్యారీ జట్టులో చేరనున్నాడు. గ్యారీ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌/మెంటార్‌గా ఉన్నాడు.

Updated Date - Apr 29 , 2024 | 05:47 AM