ఐపీఎల్ తొలిరోజు రికార్డు బద్దలు
ABN , Publish Date - Mar 29 , 2024 | 02:25 AM
ఐపీఎల్ 17వ సీజన్ తొలిరోజు వ్యూయర్షిప్లో రికార్డులను బద్దలుకొట్టింది. టోర్నీకి మొదటి రోజైన ఈనెల 22వ తేదీన టీవీల్లో ఏకంగా 16.8 కోట్ల వ్యూస్ వచ్చాయని అధికారిక బ్రాడ్కాస్టర్ డిస్నీ స్టార్ పేర్కొంది...
న్యూఢిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్ తొలిరోజు వ్యూయర్షిప్లో రికార్డులను బద్దలుకొట్టింది. టోర్నీకి మొదటి రోజైన ఈనెల 22వ తేదీన టీవీల్లో ఏకంగా 16.8 కోట్ల వ్యూస్ వచ్చాయని అధికారిక బ్రాడ్కాస్టర్ డిస్నీ స్టార్ పేర్కొంది. ఆ రోజు చెన్నై-బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్కు ముందు బాలీవుడ్ స్టార్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తిలకించిన సమయం కూడా 1,276 కోట్ల నిమిషాలుగా నమోదైందట. ఇప్పటివరకు అన్ని సీజన్ల తొలి రోజుకు సంబంధించి ఇదే అత్యుత్తమం. గతేడాది ఇది 870 కోట్ల నిమిషాలుగా ఉందట. మొత్తంగా గతేడాదితో పోలిస్తే టీవీక్షణంలోనూ 16 శాతం పెరుగుదల నమోదైంది. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ జియో సినిమాకూ తొలి మ్యాచ్కు 11.3 కోట్ల వ్యూయర్షిప్ దక్కింది.