Share News

భారత్‌ వెనక్కి, ఆసీస్‌ ముందుకి..

ABN , Publish Date - May 04 , 2024 | 05:24 AM

ఐసీసీ పురుషుల తాజా టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌, వన్డే, టీ20 ఫార్మాట్లలో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా, టెస్టుల్లో మాత్రం భారత్‌ను వెనక్కినెట్టి...

భారత్‌ వెనక్కి,  ఆసీస్‌ ముందుకి..

టెస్టు ర్యాంకింగ్స్‌ టీ20, వన్డేల్లో నెం.1 పదిలం

దుబాయ్‌: ఐసీసీ పురుషుల తాజా టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌, వన్డే, టీ20 ఫార్మాట్లలో తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా, టెస్టుల్లో మాత్రం భారత్‌ను వెనక్కినెట్టి, ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను చేజిక్కించుకుంది. శుక్రవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ టీ20ల్లో 264 పాయింట్లతో, వన్డేలో 122 పాయింట్లతో టాప్‌లో నిలవగా, టెస్టుల్లో 120 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టెస్టుల్లో ఆస్ట్రేలియా 124 పాయింట్లతో తిరిగి ప్రథమ స్థానానికి ఎగబాకగా, ఇంగ్లండ్‌ 105 పాయింట్లతో మూడో స్థానంలో నిలకడగా కొనసాగుతోంది. వన్డేలో భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. టీ20లో భారత్‌ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ ఉన్నాయి.

Updated Date - May 04 , 2024 | 05:24 AM