షూటింగ్లో మరో ఒలింపిక్ బెర్త్
ABN , Publish Date - Apr 29 , 2024 | 05:46 AM
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్కు మరో బెర్త్ లభించింది. దోహాలో జరిగిన షాట్గన్ ఒలింపిక్ చివరి క్వాలిఫికేషన్ టోర్నీ స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహాన్ రజత పతకం...
స్కీట్లో మహేశ్వరికి రజతం
న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్కు మరో బెర్త్ లభించింది. దోహాలో జరిగిన షాట్గన్ ఒలింపిక్ చివరి క్వాలిఫికేషన్ టోర్నీ స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహాన్ రజత పతకం దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో మహేశ్వరి 3-4తో ఫ్రాన్సిస్కా క్రొవేటో చేతిలో పరాజయంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ రజత పతకం ద్వారా పారిస్ క్రీడల షూటింగ్ విభాగంలో భారత్కు 21వ బెర్త్ లభించింది. మహిళల స్కీట్లో మాత్రం రెండో కోటా స్థానమిది.