Share News

గుకే్‌షకు రూ.75 లక్షలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:44 AM

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించిన దొమ్మరాజు గుకే్‌షకు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు...

గుకే్‌షకు రూ.75 లక్షలు

  • అందజేసిన సీఎం స్టాలిన్‌

చెన్నై (ఆంధ్రజ్యోతి): ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించిన దొమ్మరాజు గుకే్‌షకు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు. ఇటీవల టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ చెన్నై టీనేజర్‌ వరల్డ్‌ చాంపి యన్‌షిప్‌నకు క్వాలిఫై అయిన పిన్నవయస్సు ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గుకేష్‌ తన తల్లిదండ్రులతో కలిసి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్టాలిన్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గుకే్‌షను శాలువతో సత్కరించి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున అతడికి రూ. 75 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో క్రీడామంత్రి ఉదయనిధి కూడా పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 05:44 AM