Prajagalam; తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో

ABN, Publish Date - May 08 , 2024 | 01:08 PM

చిత్తూరు జిల్లా: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దొంగలు పడ్డారని, ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా వుండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో కలసి ఆయన తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. నగరంలోని నాలుగు కాళ్ళమండపం కూడలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోనే పుట్టి పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల ఆశీస్సులతో రాష్టంలో, జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన నేతగా ఎదిగానన్నారు. పాలనలో నిజాయితీగా వ్యవహరించినందుకు తనపై శత్రువులు 23 క్లైమోర్‌ మైన్లు పేల్చారని, అయితే వెంకటేశ్వరస్వామి తనకు పునర్జన్మ ఇచ్చారనన్నారు. సీట్ల విషయంలో సామాజిక న్యాయానికి కట్టుబడి తాము కూటమి తరపున ఆరణి శ్రీనివాసులును పోటీకి నిలబెట్టామన్నారు.

Prajagalam; తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో 1/5

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరుపతిలో ప్రజాగళం సభకు విచ్చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం..

Prajagalam; తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో 2/5

తిరుపతి ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

Prajagalam; తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో 3/5

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరుపతి ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రక్కన చంద్రబాబు, కూటమి నేతలు..

Prajagalam; తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో 4/5

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరుపతిలో ప్రజాగళం సభకు విచ్చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభిమానులు సంత్రాలను మాలగామార్చి క్రేన్ ద్వారా సన్మానిస్తు్న్న దృశ్యం.

Prajagalam; తిరుపతిలో పవన్‌తో కలిసి చంద్రబాబు రోడ్ షో 5/5

తిరుపతిలో పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..

Updated at - May 08 , 2024 | 01:08 PM