ఓడ బందీలను విడుదల చేసిన ఇరాన్
ABN , Publish Date - May 04 , 2024 | 02:44 AM
రివల్యూషనరీ గార్డ్స్ గత నెల 13న స్వాధీనం చేసుకున్న కార్గో షిప్లోని మొత్తం 25 మంది సిబ్బందిని విడుదల చేసినట్టు శుక్రవారం ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 3: రివల్యూషనరీ గార్డ్స్ గత నెల 13న స్వాధీనం చేసుకున్న కార్గో షిప్లోని మొత్తం 25 మంది సిబ్బందిని విడుదల చేసినట్టు శుక్రవారం ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సిబ్బందిలో మొత్తం 17 మంది భారతీయులు ఉన్నారు. పోర్చుగీస్ జెండాతో వెళ్తున్న ఎంఎ్ససీ ఏరిస్ కార్గోషి్పను హర్ముజ్ జలసంధి వద్ద రివల్యూషనరీ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇజ్రాయెల్ నౌక అని, సముద్రయాన చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ స్వాధీనం చేసుకున్నారు.