Share News

ఓడ బందీలను విడుదల చేసిన ఇరాన్‌

ABN , Publish Date - May 04 , 2024 | 02:44 AM

రివల్యూషనరీ గార్డ్స్‌ గత నెల 13న స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లోని మొత్తం 25 మంది సిబ్బందిని విడుదల చేసినట్టు శుక్రవారం ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఓడ బందీలను విడుదల చేసిన ఇరాన్‌

న్యూఢిల్లీ, మే 3: రివల్యూషనరీ గార్డ్స్‌ గత నెల 13న స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌లోని మొత్తం 25 మంది సిబ్బందిని విడుదల చేసినట్టు శుక్రవారం ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సిబ్బందిలో మొత్తం 17 మంది భారతీయులు ఉన్నారు. పోర్చుగీస్‌ జెండాతో వెళ్తున్న ఎంఎ్‌ససీ ఏరిస్‌ కార్గోషి్‌పను హర్ముజ్‌ జలసంధి వద్ద రివల్యూషనరీ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇజ్రాయెల్‌ నౌక అని, సముద్రయాన చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 04 , 2024 | 06:54 AM