భారీ లాభాలతో ముగింపు
ABN , Publish Date - Mar 29 , 2024 | 02:55 AM
ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఈ ఆర్థిక సంవత్సరానికి భారీ లాభాలతో ముగింపు పలికాయి. ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ సెషన్ అయిన గురువారం సెన్సెక్స్ 655.04 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద స్థిరపడింది...
2023-24 చివరి ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 655 పాయింట్లు అప్
ప్రామాణిక ఈక్విటీ సూచీలు ఈ ఆర్థిక సంవత్సరానికి భారీ లాభాలతో ముగింపు పలికాయి. ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ సెషన్ అయిన గురువారం సెన్సెక్స్ 655.04 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద స్థిరపడింది. ఒక దశలో 1,194 పాయింట్లు పెరిగి 74,190 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసినప్పటికీ.. చివర్లో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా సూచీలు మళ్లీ జారుకున్నాయి. నిఫ్టీ 203.25 పాయింట్ల వృద్ధితో 22,326.90 వద్ద క్లోజైంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లకు పాల్పడటం నేటి ర్యాలీకి ప్రధానంగా దోహపడింది. ప్రధాన కంపెనీలతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లకూ కొనుగోళ్ల ఆదరణ లభించింది. దాంతో బీఎ్సఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు 0.62 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీ సూచీలన్నీ పాజిటివ్గా ముగిశాయి. దాంతో బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే రూ.3.33 లక్షల కోట్ల మేర పెరిగింది.