Share News

పసిడి రుణాలపై నగదు రూ.20,000 మించొద్దు: ఆర్‌బీఐ

ABN , Publish Date - May 10 , 2024 | 02:19 AM

వ్యక్తిగత పసిడి రుణాలపై ఇచ్చే నగదు మొత్తం రూ.20,000 మించొద్దని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లకు సూచించింది...

పసిడి రుణాలపై నగదు రూ.20,000 మించొద్దు: ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: వ్యక్తిగత పసిడి రుణాలపై ఇచ్చే నగదు మొత్తం రూ.20,000 మించొద్దని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లకు సూచించింది. ఈ విషయంలో ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 269 ఎస్‌ఎ్‌సను తూచా తప్పకుండా పాటించాలని కోరిది. ఈ సెక్షన్‌ ప్రకారం ఏ వ్యక్తీ రూ.20,000కు మించి డిపాజిట్లను, రుణాలను నగదు రూపంలో ఆమోదించకూడదు. ఐఐఎ్‌ఫఎల్‌ ఫైనాన్స్‌ కంపెనీ పసిడి రుణాలపై ఆంక్షలు విధించిన కొద్ది వారాలకే ఆర్‌బీఐ ఎన్‌బీఎ్‌ఫసీలకు ఈ సూచనలు జారీ చేయడం విశేషం.

Updated Date - May 10 , 2024 | 02:19 AM