Share News

CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 07:01 AM

భీమవరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు.

CM Jagan:  భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

భీమవరం: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ (Siddam Sabha) నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. నిడమర్రు, భువనపల్లి మీదుగా పది గంటలకు గణపవరం చేరుకుంటుంది. తర్వాత సరిపల్లె, కోలమూరు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఉండి చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభించి 4.30 గంటలకు భీమవరం చేరుకుంటారు. బైపాస్‌ రోడ్‌లోని జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.


ఈ క్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించేందుకు అధికార పార్టీ నేతలు తలమునకలయ్యా రు. ఒక్కో నియోజకవర్గం నుంచి 150 బస్సుల్లో జనాన్ని తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ఇచ్చేందుకు ఆర్టీసీ సైతం 140 బస్సులను కేటాయించింది. ప్రతి నియోజకవర్గం నుంచి పది వేల మందికి తక్కువ కాకుండా జనం హాజరయ్యేలా చూడాలని అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. ఇందు కోసం అభ్యర్థులంతా ఆపసోపాలు పడుతున్నారు. భీమవరంలో సభ అనంతరం గరగపర్రు, ఉణుదుర్రు, ముదునూరు రావిపాడు మీదుగా బస్సు యాత్ర తణుకు చేరుతుంది. తణుకు వై.జంక్షన్‌ నుంచి పెరవలి, సిద్ధాంతం మీదుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఈతకోటకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.

Updated Date - Apr 16 , 2024 | 07:51 AM