Share News

కారును ఢీకొన్న టిప్పర్‌

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:42 PM

: టిప్పరు కారును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడా ్డరు.

కారును ఢీకొన్న టిప్పర్‌
నుజ్జునుజ్జయిన కారు

ఒకరి దుర్మరణం

మృతుడు టీవీఎన షోరూం యజమాని

నుజ్జునుజ్జైన కారు

బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్‌ 15 : టిప్పరు కారును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడా ్డరు. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలచెరువుకు చెంది న అంబవరం జయసుబ్బారెడ్డి (48) బద్వే లు పట్టణంలోని మైదుకూరోడ్డులో టీవీఎస్‌ షో రూం నిర్వహిస్తుంటాడు. సోమవారం తన స తీమణి లక్ష్మిదేవితో కలసి కారులో ప్రొద్దుటూ రుకు వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడి నుంచి బద్వేలుకు తిరిగి వస్తుండగా నంది పల్లె సమీపంలోని దొడ్లడైరీ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పరు, ఢీకొంది. దీంతో కారులో ఉన్న జయసుబ్బా రెడ్డి ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జునుజ్జు అయింది. విషయం గమనించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన జయసుబ్బారెడ్డిని బయటికి తీసి 108 వాహనంలో కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్థానిక బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వస్తున్నట్లు సమాచారం, తీవ్ర ంగా గాయపడిన లక్ష్మిదేవి కడపలోని ఓ ప్రైవేటు ఆసు పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:42 PM