Share News

ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:36 PM

స్థానిక నీరుగట్టువారిపల్లెలోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఏర్పాటు చేసి న ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన లభించింది.

ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన

మదనపల్లె అర్బన, ఏఫ్రిల్‌ 14: స్థానిక నీరుగట్టువారిపల్లెలోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఏర్పాటు చేసి న ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన లభించింది. చేనేత కార్మిక సంఘం ఏపీ వారి ఆధ్వర్యంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఉమాదేవి మెటర్నటీ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌ మదనపల్లె వారిచే డాక్టర్‌ సి రమాదేవి, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ ఆర్‌వీ దినేష్‌కుమార్‌ లు ఉచిత వైద్యశిబిరంలో 200మంది చేనేత కార్మిక కుటుంబసభ్యులకు ఆరోగ్య పరీక్షలతోపాటు ఉచి తంగా మందులు అందజేశారు. చేనేత కార్మిక యూనియన ఏపీ ఉపాధ్యక్షుడు రామ్మోహన, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జింకా వెం కరమణ, రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు వెం కటేష్‌, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, సత్యసాయిజిల్లా ఉపాధ్యక్షు డు మధుసూదన, తంబళ్లపల్లె అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఆలయ కమి టీ అధ్యక్షుడు వెంకటరత్నం, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 11:36 PM