Share News

టీడీపీ ప్రచార రథాన్ని తగులపెట్టడం దుర్మార్గపు చర్య

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:48 PM

పీలేరు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రచార రథాన్ని తగులబెట్ట్టడం దుర్మార్గపు చర్య అని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు పేర్కొన్నారు.

టీడీపీ ప్రచార రథాన్ని తగులపెట్టడం దుర్మార్గపు చర్య
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ములకలచెరువు, ఏప్రిల్‌ 28: పీలేరు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రచార రథాన్ని తగులబెట్ట్టడం దుర్మార్గపు చర్య అని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు పేర్కొన్నారు. ఆదివారం రాజంపేట పార్లమెంటు బీసీ సెల్‌ అధికార ప్రతి నిధి ముత్తు కూరు మౌళా, రాష్ట్ర పాల ఏకరి సాధికార సమితి కార్యవర్గ సభ్యుడు జేసీబీ సుధాకర్‌నాయుడు, నియోజకవర్గ రైతు నాయకులు సుధాకర్‌ నాయుడుతో కలిసి మండలంలోని బురకాయలకోటలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ ప్రచార రథాన్ని దగ్ధం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలు పనరా వృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవలన్నారు. ఈ సమావేశంలో నాయకులు రామకృష్ణ మరాజు, చెన్నకేశవులు, రిజ్వానబాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:48 PM