Share News

బలిజలు ఐక్యంగా ఎనడీఏ అభ్యర్థులను గెలిపించాలి

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:57 PM

బలిజలు ఐక్యంగా ఎనడీఏ అభ్యుర్థులను గెలిపిం చా లని కాపునాడు నేత వంగవీటి రాధ పేర్కొ న్నారు.

బలిజలు ఐక్యంగా ఎనడీఏ అభ్యర్థులను గెలిపించాలి
మదనపల్లె సమావేశంలో మాట్లాడుతున్న వంగవీఽటి రాధ

దోపిడీ చేసి దాచుకునే వైసీపీని సాగనంపాలి

కాపునాడు నేత వంగవీటి రాధా

మదనపల్లె అర్భన, ఏఫ్రిల్‌ 15: బలిజలు ఐక్యంగా ఎనడీఏ అభ్యుర్థులను గెలిపిం చా లని కాపునాడు నేత వంగవీటి రాధ పేర్కొ న్నారు. సోమవారం స్థానిక సీఎస్‌ఐ కమ్యూ నిటీ హాల్‌లో జనసేన నేత శ్రీరామాంజనేయులు, రామాచా ర్లపల్లె యుగంధర్‌ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బలిజ, కాపు రాజకీ య సమా వేశానికి బలిజలతోపాటు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావే శానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన కాపుసామాజికవర్గ నాయకుడు వంగవీటి రాధ మాట్లాడుతూ రాష్ట్రంలో దోపిడీ పాలన చేసి దాచుకుంటున్న వైసీపీని సాగనంపాలని సంఘ నేతలను, ప్రజలను కోరారు. జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, తెలుగు యువత శ్రీరాం చినబాబు మాట్లా డుతూ జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని అసెంబ్లీ కూటమి అభ్యర్థులను గెలిపిం చాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో మదనపల్లె టీడీపీ బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధి ఎం షాజహానబాషా, టీడీపీ నాయకులు విద్యాసాగర్‌, దొరస్వామినాయు డు, రాట కొండ మధుబాబు, కత్ల్తి లక్ష్మున్న, మాజీ సర్పంచ మోహన, నాగూర్‌వలి, గిరీషా, బీజేపీ నాయకుడు కిరణ్‌కుమార్‌, జనసేన నాయకులు జంగాల శివరాం, అడపా సురేంద్ర, బలిజ సంఘం నాయకులు కోసూరి రామమూర్తి, రాయల్‌ గణి, బోర్‌వెల్‌ నాగరాజ, బ్యాంక్‌ రమణ, శ్రీనివాసులు, రాయచోటి రవీంద్ర,పూల మురళి, మహర్షి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:57 PM